హైదరాబాద్లో 2 ప్రమాదాల్లో నలుగురి మృతి

హైదరాబాద్లో 2  ప్రమాదాల్లో నలుగురి మృతి

కంటోన్మెంట్/ ఖైరతాబాద్, వెలుగు: కొత్త సంవత్సరం మొదటిరోజున హైదరాబాద్​లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు.ఆదివారం తెల్లవారుజామున పనులకు వెళ్లేందుకు రోడ్డుపైకొచ్చిన ఇద్దరిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొడుకును చూసేందుకు నిర్మల్​ నుంచి సిటీకి వచ్చిన దంపతులు రోడ్డు దాటుతుండగా సిటీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందారు. ఉదయం 5గంటలకు పనులకు వెళ్లేందుకు శ్రీనివాస్, మరో మహిళ ఈశ్వరి బంజారాహిల్స్​లోని రాయల్ టిఫిన్​ సెంటర్​వద్ద నిల్చున్నారు. 

కె.ప్రణవ్, పి.శ్రీవర్ధన్ రావు ఇంజనీరింగ్ స్టూడెంట్లు అదే టైమ్​లో సెలెరియో కారులో బంజారాహిల్స్​ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్నారు. స్పీడ్​గా వచ్చిన వీరి కారు రాయల్​టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్​ను​ ఢీకొని అక్కడే నిల్చున్న శ్రీనివాస్, ఈశ్వరిపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడి ఇద్దరూ స్పాట్​లోనే చనిపోయారు. నిందితులు ప్రణవ్, శ్రీవర్ధన్​ను బంజారాహిల్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొడుకును చూసేందుకు వచ్చి

నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ కు చెంది న తునికి తులసీదాస్(70) అతని భార్య రాజ మణి (65) గచ్చిబౌలిలో ఉండే కొడుకు రామరాజును చూసేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చారు. బోయిన్ పల్లి చౌరస్తాలో మధ్యా హ్నం బస్సు దిగారు. బాలానగర్​వైపు వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేస్తుండగా సిటీ బస్సు ఢీకొట్టింది. ఇద్దరూ స్పాట్​లోనే చనిపోయారు. స్థానికులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి(45) ని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలంలో దొరికిన సెల్ ఫోన్ తో తులసీదాస్​కొడుకు రామరాజుకు కాల్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న రామరాజు తల్లిదండ్రుల మృతదేహాలను చూసి బోరున విలపించారు.