తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ డెత్ నమోదైంది. కేరళకు చెందిన ఓ యువకుడు (22) శనివారం మధ్యాహ్నం మంకీపాక్స్తో చనిపోయాడు. ఇప్పటివరకు దేశంలో 4మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, మరణం సంభవించడం ఇదే తొలిసారి. అయితే, త్రిసూర్ జిల్లా, పున్నయూర్ కు చెందిన ఆ యువకుడు జులై 22న యూఏఈ నుంచి వచ్చాడని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ వెల్లడించారు.
విదేశాల్లోనే మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిందని, కానీ కుటుంబసభ్యులు శనివారమే ఆ రిపోర్టును డాక్టర్లకు అందజేశారని తెలిపారు. ‘‘అతనికి మంకీపాక్స్ సింప్టమ్స్ ఏమీ లేవు. కానీ మెదడువాపు, తీవ్ర ఆయాసంతో జులై 26న ఆస్పత్రిలో చేరాడు. మంకీపా క్స్తో మరణం సంభవించే చాన్స్తక్కువ. డెత్ పై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం’’ అని మంత్రి చెప్పారు. శాంపిల్స్ను అళప్పుళలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి టెస్టింగ్ కోసం పంపినట్లు చెప్పారు. యూఏఈ నుంచి వచ్చాక యాక్టివ్ గానే ఉన్నా.. చనిపోయాడని బంధువులు తెలిపారు.