- ఎల్లూరు పంపు హౌస్లో మూలకుపడ్డ 2 మోటార్లు
- కోటి రూపాయల పనులు నీళ్లపాలు
- కృష్ణా నదిలో నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి
- 50టీఎంసీలకుగాను ఇప్పటివరకు
- ఎత్తిపోసింది 15 టీఎంసీలే
- మున్ముందు తాగునీటికీ కష్టకాలమే
నాగర్కర్నూల్, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలోని మొదటి పంప్హౌజ్ ఎల్లూరు నీట మునిగి ఏడాది దాటుతున్నా సర్కారు నేటికీ రిపేర్లు చేయలేకపోయింది. ప్రమాదానికి కారణాలు అన్వేషించడానికి నియమించిన కమిటీ సైతం నెలలు గడుస్తున్నా ఏమీ తేల్చడం లేదు. ప్రమాదంలో మూడో పంప్బేస్ నుంచి విడిపోగా పంప్హౌజ్లో 54 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది. బేస్నుంచి విడిపోయిన మూడో పంప్ ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఐదో పంప్, అప్రోచ్చానల్కు మధ్య ఉండే రాక్లెడ్జర్కు పడ్డ హోల్ను బాగుచేసే పనులను ఆరేడు నెలలపాటు పట్టించుకోని ఇరిగేషన్ఇంజనీర్లు ఈ ఏడాది వేసవిలో హడావిడిగా మొదలు పెట్టారు. ఐదేళ్లుగా మెయింటెనెన్స్పనులు చేస్తున్న పటేల్ కంపెనీని కాదని మేఘా కంపెనీని రంగంలోకి దింపారు. ఎస్టిమేషన్ ప్రపోజల్స్లేకుండానే సాగునీటి సలహాదారు పెంటారెడ్డి సూపర్వైజింగ్లో పనులు చేయించారు. పంప్హౌజ్, సర్జ్పూల్మధ్యన ఉన్న రాక్ లెడ్జర్కు పడిన భారీ రంధ్రాన్ని మూసేందుకు అప్రోచ్కెనాల్ను క్లోజ్ చేశారు.15 రోజుల పాటు మిషన్ భగీరథకు వాటర్ సప్లై ఆపేశారు. ఇంతా చేస్తే కట్టిన ప్రొటెక్షన్ వాల్ మూడు రోజులకే కూలినట్లు గుర్తించారు. ఐదో పంప్కెనాల్షటర్ తెరిస్తే పంప్హౌజ్ మునిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో దాన్ని కూడా మూసేశారు. దీంతో దాదాపు రూ. కోటి వరకు చేసిన ఖర్చు నీళ్లపాలైంది. ఇక ఐదో పంప్కింద సీపేజ్వాటర్ సమస్య తీవ్రత దృష్ట్యా నాలుగు పంపులు పెట్టి కంటిన్యూగా డీవాటరింగ్ చేస్తున్నారు. మొదటి లిఫ్ట్లోని ఐదు పంపుల్లో రెండు మూలకు పడగా ప్రస్తుతానికి మిగిలిన మూడింటితోనే మిషన్భగీరథ స్కీం, సాగుకు నీటిని పంపింగ్చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క పంప్ రిపేర్కు వచ్చినా సమస్య మొదటికి వస్తుంది.
ఇప్పటికీ 15 టీఎంసీలే..
ఈ సీజన్లో కృష్ణా నదికి భారీ వరదలు వస్తుండగా కేఎల్ఐ, మిషన్ భగీరథకు 50 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉండేది. తద్వారా కేఎల్ఐ కింద 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇరిగేషన్అధికారుల పట్టనితనంతో ఆయకట్టుతో పాటు 19 నియోజకవర్గాలకు తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా నదికి జూన్లో వరదలు స్టార్ట్ కాగా కేఎల్ఐ కింద ఇప్పటివరకు కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్ చేయగలిగారు. మిగిలిన 35 టీఎంసీల నీటిని త్వరలో ఎత్తిపోస్తామని ఇరిగేషన్ అధికారులు అంటున్నా మూడు పంపులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండు పంపులు పనిచేయకపోవడం వల్ల కనీసం 15 టీఎంసీలు లాస్ అయినట్లే నని తెలుస్తోంది. వచ్చేది వేసవి కావడం వల్ల ఉన్న మూడుపంపుల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా తాగునీటికి సమస్యలు తలెత్తే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.