
దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా నమోదుకావడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 86,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు 80 వేలకు పైగానే నమోదవుతున్నాయి. శుక్రవారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. ఇందులో 8,46,395 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 31,07,223గా ఉంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 1089 మంది కరోనాతో మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 69,561కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
శుక్రవారం దేశవ్యాప్తంగా 10,59,346 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 4,77,38,491 టెస్టులు చేసినట్లు తెలిపింది.
For More News..