ఐపీఎల్‌‌ మినీ వేలం కోసం ఐదు నగరాలు

ఐపీఎల్‌‌ మినీ వేలం కోసం ఐదు నగరాలు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌‌ మినీ వేలం కోసం ఐదు నగరాలను షార్ట్‌‌ లిస్ట్‌‌ చేశారు. హైదరాబాద్‌‌తో పాటు ఇస్తాంబుల్‌‌ (టర్కీ), బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇందులో ఉన్నాయి. డిసెంబర్‌‌ 16న ఈ ఆక్షన్‌‌ జరిగే చాన్స్‌‌ ఉంది. ఐపీఎల్‌‌ కొత్త చైర్మన్‌‌ అరుణ్‌‌ ధుమాల్‌‌.. గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ తొలి మీటింగ్‌‌లో వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘ప్రస్తుతానికైతే ఇస్తాంబుల్‌‌ అనుకుంటున్నాం. ఫ్రాంచైజీలతో ఇంకా మాట్లాడలేదు.

కొవిడ్‌‌ లేదు కాబట్టి మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నాం. ఐదు నగరాల్లో దేనికైనా వెళ్లొచ్చు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. రిటైన్​ ప్లేయర్ల లిస్ట్‌‌ను నవంబర్‌‌ 15 వరకు పంపించాలని అన్ని ఫ్రాంచైజీలకు తెలిపామన్నాడు. వచ్చే సీజన్‌‌ కోసం ఫ్రాంచైజీల శాలరీ క్యాప్‌‌ను  రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచనున్నారు.