మృతుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా

మృతుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా

కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేసియా ప్రకటించింది రాష్ట్ర సర్కార్. మృతుల కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు RDO. అయితే ఉదయం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాలను రామాపురం తరలించారు అధికారులు. దీంతో మధ్యలోనే మృతదేహాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు….చనిపోయిన కుటుంబాలను అదుకోవాలని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, MRPS నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు సర్ధిచెప్పిన వినిపించుకోలేదు. దీంతో ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ఆర్టీవో. మరోవైపు మృతదేహాలు స్వగ్రామం రామాపురం చేరుకోవడంతో ఊర్లో విషాద చాయలు నెలకొన్నాయి.