ఫ్రాన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ ఫ్రాన్స్ లో ఓ మైక్రో లైట్ ఫ్లైట్, మరో టూరిస్ట్ ఫ్లైట్ రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఇంద్రే-ఎట్-లోయిర్ అనే లోచెస్లో ఈ ఘటన జరిగింది. ఒక విమానం ఓ ఇంటి ప్రాంగణంలో కూలిపోయింది.. రెండవ విమానం ఎవరూ లేని ప్రాంతంలో కూలింది. మైక్రోలైట్ విమానంలో ఇద్దరు ,టూరిస్ట్ ఫ్లైట్ DA40 లో ఉన్న ముగ్గురు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ