సంగారెడ్డిలో ఫ్లిప్​కార్ట్​ ఫుల్​ ఫిల్​మెంట్ ​సెంటర్​.. 40 వేల మందికి ఉపాధి

సంగారెడ్డిలో ఫ్లిప్​కార్ట్​ ఫుల్​ ఫిల్​మెంట్ ​సెంటర్​.. 40 వేల మందికి ఉపాధి

హైదరాబాద్​, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌కార్ట్ తెలంగాణలో తన బిజినెస్​ను విస్తరించింది.  సంగారెడ్డిలో కొత్త ఫుల్‌‌‌‌ఫుల్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను ప్రారంభించడం ద్వారా తన సప్లయ్‌‌ చెయిన్‌‌ను బలోపేతం చేసింది. హైదరాబాద్​లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్​, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ దీనిని వర్చువల్​గా ప్రారంభించారు. తెలంగాణ పరిశ్రమ, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌‌‌‌ రంజన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ సీఈవో కల్యాణ్‌‌‌‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సదుపాయం తెలంగాణలోని వేలాది స్థానిక సెల్లర్లకు, ఎంఎస్​ఎంఈలకు, రవాణా, డెలివరీ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా వీళ్లు జాతీయ మార్కెట్‌‌‌‌కు యాక్సెస్​ పొందవచ్చు. ఈ ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్​ను 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.  ఫలితంగా 40వేల ప్రత్యక్ష,  పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలుగుతారు.  ఫ్లిప్​కార్ట్​ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 14 వేల కంటే ఎక్కువ మంది సెల్లర్లను తన ప్లాట్​ఫారమ్​లో చేర్చుకుంది.         

వర్కర్లను బాగా చూసుకోండి : మంత్రి కేసీఆర్​

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత సరిగా ఉండని అసంఘటిత రంగ కార్మికులను బాగా చూసుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌కు సూచించారు. పనిచేసేవాళ్లు సురక్షితంగా ఉండేలా చూసుకుంటే గిగ్​ వర్కర్లకు ఇబ్బందులు రాకుండా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు.  ‘‘ఈ-–కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోంది. ఇందులో పనిచేయాలనే ఆకాంక్షను యువతలో పెంపొందించాలి. ఈ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా ఒక నమూనాను తయారు చేద్దాం. ఈరోజు తెలంగాణ ఏం చేస్తే రేపు దేశం అదే చేస్తుంది.  కార్మికుల జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం,  ఈ–కామర్స్ కంపెనీలు,  మార్కెటింగ్, సెల్లర్లు, పార్ట్​నర్ల  మధ్య  ఒప్పందం ఉండాలి. మహిళా స్వయం సహాయక సంఘాల సేవలను కూడా ఫ్లిప్​కార్ట్​ వాడుకోవాలి”అని అన్నారు.