హైదరాబాద్, వెలుగు: తన సభ్యులకు బిజినెస్లో సాయం అందించడానికి, గైడ్ చేయడానికి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) టీ–హబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ ఎకోసిస్టమ్ ను ఇంకా విస్తరించడానికి, మహిళా ఎంట్రప్రెనూర్లను శక్తిమంతం చేయడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఇందుకోసం ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి. తెలంగాణలో మహిళా ఎంట్రప్రెనూర్లకు వనరులు, మార్గదర్శకత్వం, నిధులు అందేలా సాయం చేస్తామని ప్రకటించాయి.
మహిళల్లో ఇన్నోవేషన్ను, ఎంట్రప్రెనూర్షిప్ను ఎంకరేజ్ చేసేలా చూస్తామని ఎల్ఎల్ఓ చైర్పర్సన్ రీతూ షా అన్నారు. స్కూల్దశలోనే ఎంట్రప్రెనూర్గా మారాలనుకునే వారికో త్వరలో వర్క్షాప్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ మహిళల బిజినెస్లకు మరింత సహకరించడానికి వై–హబ్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇందులో ట్రైనింగ్ తీసుకోవడానికి స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. చిన్న వయసులోనే ఎంట్రప్రెనూర్లుగా మారాలనుకునే వారిని గైడ్ చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయపడడానికి సింగిల్ విండో సదుపాయంతో ముందుకు రావాలని భావిస్తోందని జయేష్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో టీ–హబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి, వీ–హబ్ సీఈఓ దీప్తి రావుల తదితరులు పాల్గొన్నారు.
