రైతుల ఫొటోలతో కొబ్బరినూనె డబ్బాలు

రైతుల ఫొటోలతో కొబ్బరినూనె డబ్బాలు

సంస్థకు పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగస్తుల పనితనానికి గుర్తుగా చాలాకంపెనీలు బోనస్ లు, గిఫ్ట్ లు ఇస్తుంటాయి. అది వాళ్లను గౌరవించినట్టు ఉంటుంది. వాటివల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం వచ్చి బాగా పనిచేయగలుగుతారు. అలాంటి పనే మారికో పారాషూట్ ఆయిల్స్ చేసింది. ఎఫ్​ఎంసీజీ బ్రాండ్​ మారికో తన పారాషూట్ అడ్వాన్స్‌డ్ గోల్డ్ ప్యాక్‌ కొబ్బరి నూనె డబ్బాలపై కొబ్బరి రైతుల ఫొటోలు, పేర్లను ముద్రిస్తోంది. వ్యవసాయరంగానికి వాళ్లు అందించిన సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. వాళ్ల గుర్తుగా ఈ పని చేస్తున్నామని తెలిపింది.

కొబ్బరి రైతుల సంక్షేమం కోసం మారికో స్థాపించిన పారాషూట్ kal​కల్పవృక్ష ఫౌండేషన్,  ప్రపంచ కొబ్బరి దినోత్సవం (సెప్టెంబర్2, 2017) నాడు ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు 62 వేల మందికి రైతులకు శిక్షణ అందించి, వారి దిగుబడులను పెంచినట్లు మారికో ప్రకటించింది.

ఈ ఫౌండూషన్ ప్రచారానికి కి ఐశ్వర్య లక్ష్మి, లక్ష్మి మంచు, కల్యాణి ప్రియదర్శన్, శరత్ కుమార్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త హోర్నాడ్ వంటి కొంతమంది దక్షిణ భారత ప్రముఖులు మద్దతునిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా వినియోగదారులకు రైతు సమాజాన్ని మరింత దగ్గర చేయొచ్చని మారికో భావిస్తుంది.