
- రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘటన
షాద్ నగర్, వెలుగు : షాద్ నగర్ టౌన్లో ఫుడ్పాయిజనింగ్అయి 13 మంది మున్సిపల్కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్అధికారులు మంగళవారం టౌన్లో ‘స్వచ్ఛదనం-– పచ్చదనం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్కార్మికుల కోసం స్థానిక హోటల్నుంచి ఫుడ్తెప్పించారు. అయితే భోజనం చేశాక మున్సిపల్కార్మికులకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్నను వివరణ కోరగా కార్మికుల కోసం భోజనాలు తెప్పించామని, ఎప్పటిలాగే స్థానిక హోటల్కు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. భోజనం చేశాక కార్మికులు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఫుడ్శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని వెల్లడించారు. బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లడంతో అస్వస్థతకు గురయ్యారా? లేక ఫుడ్పాయిజనింగ్జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.