కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ జిల్లా:  కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకుంటున్న వారిని  కొత్తగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిన్నటి నుంచి వాంతులు, విరేచనాలు చేసుకుంటున్న విద్యార్థుల పరిస్థితి నికలడగానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.
మొన్న ఆదివారం చికెన్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత మరొకరు అందరికీ వాంతులు, విరేచనాలు అవుతుండడంతో స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ నిర్వాహకులకు తెలియజేశారు. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందని గుర్తించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను కొత్తగూడ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాశిరకం.. నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని మండిపడుతూ వాగ్వాదానికి దిగారు.