
రామాయంపేట, వెలుగు: మెదక్జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లోని ఓ మదర్సాలో చదువుకుంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. మదర్సాలో 25 మంది చదువుకుంటుండగా, సోమవారం రాత్రి వీరిలో 10 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. నిర్వాహకులు వెంటనే రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న వారిని మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేంత వరకు వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కలెక్టర్ఆదేశించారు. ఘటన వివరాలు తెలుసుకునేందుకు మెడికల్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్వెంట డీసీహెచ్ శివ దయాల్ ఉన్నారు.