ఎవరినైనా బాధపెడితే క్షమించండి

ఎవరినైనా బాధపెడితే క్షమించండి

ఆర్యవైశ్య సంఘాలకు వ్యతిరేకంగాఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు : జీవిత రాజశేఖర్
ఎవరైనా బాధపడితే క్షమాపణ కోరుకుంటున్నానని వ్యాఖ్య

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన తాజా చిత్రం శేఖర్ సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ కులాన్ని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత ఇలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. 

ఇక తాజాగా జీవిత రాజశేఖర్ అప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన ఫ్యామిలీని కించపరిచే విధంగా న్యూస్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. ఆర్య, వైశ్యుల గురించి గానీ, కోమటి వాళ్ల గురించి గానీ తాను తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల గురించి గొప్పగా చెప్పానని సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెడితే  క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ జీవిత వివరించారు.

ఇకపోతే రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్ లో ఆయన ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఈ క్రమంలోనే స్టేజీపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ కాసేపు సందడి చేయగా... ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. మీ ఇద్దరిలో ఎవరు దేనిపై ఎక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు... శివాని, శివాత్మిక ఇద్దరూ '' ఫుడ్ '' అనే సమాధానం ఇచ్చారు. ఆ తరువాత తమ కూతుళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు జీవిత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆమెను వివాదంలోకి నెట్టాయి.

మరిన్ని వార్తల కోసం...

నిర్మాతల మధ్య బ్లాంక్ చెక్ అనేది ఒక ఆయుధం

మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?