
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతోన్న మాజీ క్రికెటర్ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమురూ నాగరాజు అనే వ్యక్తి క్రికెటర్. గతంలో ఇతడు రంజీ మ్యాచులు కూడా ఆడినట్లు సమాచారం. ఏమైందో తెలియదు గానీ నాగరాజు పక్క దారి పట్టాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన అడ్డదారుల్లో సంపాదించడంపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నకిలీ అవతారం ఎత్తాడు.
తాను సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీని అంటూ ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మెన్లకు తాను రేవంత్ రెడ్డి ఓఎస్డీని అంటూ వాట్సాప్లో మెసేజ్లు పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అంటూ ఓ ఫేక్ ఈ మెయిలే క్రియేట్ చేశాడు. నాగరాజు సీఎం రేవంత్ రెడ్డి పేరుతో పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ నోటా ఈ నోటా సమాచారం పోలీసులకు చేరింది.
ఇంకేముంది సీఎం పేరుతోనే వసూళ్లకు పాల్పడుతున్న నాగరాజు ఆట కట్టించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే గురువారం (మే 22) శ్రీకాకుళంలో చాకచక్యంగా నాగరాజును అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అనంతరం అక్కడి పోలీసులకు సమాచారం అందించి.. నాగరాజును హైదరాబాద్కు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30కి పైగా ఉన్నట్లు గుర్తించి పోలీసులు ఖంగుతిన్నారు.