- కుంభం మీటింగ్కు జిట్టా సహా పలువురు నేతల గైర్హాజర్
- తన కోసం కోమటిరెడ్డి ప్రచారం చేస్తారంటున్న కుంభం
- బీసీకి టికెట్ఇవ్వకుంటే తనకే ఇవ్వాలని జిట్టా డిమాండ్
- త్వరలో బీసీ విజయభేరి సభ నిర్వహిస్తామని ప్రకటన
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా లీడర్ల మధ్య విభేదాలు కొలిక్కి రావడం లేదు. శుక్రవారం ఎవరికి వారు పోటాపోటీగా మీటింగ్లు నిర్వహించారు. పోచంపల్లిలో నిర్వహించిన గ్యారంటీ స్కీమ్సభలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి టికెట్ తనకేనని ప్రకటించగా.. బీబీనగర్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో టికెట్ఇస్తే బీసీకే ఇవ్వాలని, లేకుంటే తనకే ఇవ్వాలని జిట్టా బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
కుంభం మీటింగ్కు హాజరు కాని జిట్టా
భూదాన్ పోచంపల్లిలో శుక్రవారం ఆరు గ్యారంటీ స్కీమ్స్పై డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించి, ప్రజలకు ఆరు గ్యారంటీ స్కీమ్స్వల్ల కలిగే లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా తనకు టికెట్వస్తుందని, ఎంపీ కోమటిరెడ్డి ప్రచారం చేస్తారని కుంభం ప్రకటించారు. కాగా, ఈ మీటింగ్కు టికెట్ ఆశిస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి, పోత్నక్ ప్రమోద్కుమార్, రామాంజనేయులు గౌడ్గైర్హాజర్అయ్యారు.
బీసీలకు టికెట్ ఇవ్వాలని మీటింగ్
కుంభం మీటింగ్ వెళ్లేందుకు రెడీ అయిన పలువురిని జిట్టా బాలకృష్ణారెడ్డి, రామాంజనేయులు నిలువరించడంతో పాటు బీసీలకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్తో బీబీనగర్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిట్టా మాట్లాడుతూ భువనగిరి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థికి టికెట్ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇవ్వలేని పక్షంలో తనకే ఇవ్వాలని కోరారు. పార్టీలో కొందరు ఒంటెద్దు పోకడలు పోతున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని హైకమాండ్కు సూచించారు. టికెట్బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్తో భువనగిరిలో ఆదివారం ‘బీసీ విజయభేరి’ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే మంగళవారం వలిగొండలో ఆరు గ్యారంటీ స్కీమ్స్పై కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
జిట్టా వర్సెస్ కుంభం
ఎంపీ వెంకటరెడ్డిని వ్యతిరేకిస్తూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం, ఈ సమయంలో చేరితే టికెట్ గ్యారంటీ అన్న నమ్మకంతో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. తర్వాత కుంభం అనిల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరడంతో వారి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. టికెట్ హామీతోనే తిరిగి వచ్చిన కుంభం నియోజకవర్గంలో రెగ్యులర్గా పర్యటనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు జిట్టా సహా బీసీ లీడర్లు పోత్నక్ ప్రమోద్కుమార్, పంజాల రామాంజనేయులు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ దూరంగా ఉంటున్నారు. సపరేట్గా సమావేశాలు నిర్వహించి కుంభంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి రంగంలోకి దిగి గురువారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు కోసం పని చేయాలని సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.