ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

  సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజల తరపున కొట్లాడితే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామంలో మహంకాళీ అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్​ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్లు పెట్టడం లేదని గ్రామాల్లో పనులు చేయించలేక పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలవుతున్నారన్నారు.

అంతకుముందు చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయ పునర్ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి గోనేపల్లి గ్రామంలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలో పద్మశాలిలకు సామూహిక భవనం కట్టాలని కృషి చేస్తున్నామని, కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో జరిగిన శ్రీ మహంకాళీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని చింతమడక గ్రామంలో పట్టాభి రామలయంలో ధ్వజ స్థంభం ప్రతిష్ఠించాలని గ్రామస్తులు కోరగా వారికి  ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, పెద్దలింగారెడ్డిపల్లి సర్పంచ్ ఉదయశ్రీ తిరుపతి, రాజనర్సు పాల్గొన్నారు.