హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల నేతల సమావేశాన్ని సీఎం రేవంత్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించారని, ప్రభు త్వ సంస్థలో రాజకీయ సమావేశాలు పెట్టడం ఏంటని మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రగతి భవన్లో కొందరు లీడర్లను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నప్పుడు విమర్శించిన నేతలు.. ప్రభుత్వ భవనాల్లో పార్టీ మీటింగ్లు ఎలా పెడతారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఇస్తామన్న రూ.10 కోట్లను ఇన్చార్జీ మంత్రుల చేతిలో పెట్టడం సరికాదన్నా రు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వొద్దనే ఇలాంటి కుట్రలకు తెరతీశారన్నారు.