ప్రభుత్వ భవనాల్లో పార్టీ మీటింగ్​లా? : కడియం శ్రీహరి

ప్రభుత్వ భవనాల్లో పార్టీ మీటింగ్​లా? : కడియం శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఉమ్మడి జిల్లాల నేతల సమావేశాన్ని సీఎం రేవంత్ ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో నిర్వహించారని, ప్రభు త్వ సంస్థలో రాజకీయ సమావేశాలు పెట్టడం ఏంటని మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రగతి భవన్​లో కొందరు లీడర్లను కేసీఆర్​ పార్టీలో చేర్చుకున్నప్పుడు విమర్శించిన నేతలు.. ప్రభుత్వ భవనాల్లో  పార్టీ మీటింగ్​లు ఎలా పెడతారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఇస్తామన్న రూ.10 కోట్లను ఇన్​చార్జీ మంత్రుల చేతిలో పెట్టడం సరికాదన్నా రు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వొద్దనే ఇలాంటి కుట్రలకు తెరతీశారన్నారు.