దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ లో భాగంగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..కొందరు ప్రాణాలు కోల్పోయారు. లేటెస్ట్ గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ఐదు సూచనలు చేస్తూ ప్రధాని మోడీకి ఇటీవలే లేఖ రాశారు మన్మోహన్ సింగ్.
Former PM Manmohan Singh tests positive for COVID19, admitted to AIIMS Trauma Centre in Delhi: AIIMS Official
— ANI (@ANI) April 19, 2021
(file photo) pic.twitter.com/zZtbd6POWd