బీజేపీలో కెప్టెన్ అమరీందర్ పార్టీ విలీనం..!

బీజేపీలో కెప్టెన్ అమరీందర్ పార్టీ విలీనం..!

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సెప్టెంబర్ 19 (సోమవారం)న  బీజేపీలో జాయిన్ కానున్నారు. సెప్టెంబర్ 18న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్‌సి)ని కూడా బీజేపీలో విలీనం చేసే చాన్స్ ఉంది. ఈవిషయాన్ని పీఎల్‌సీ అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ బలియావాల్ ధ్రువీకరించారు. కెప్టెన్‌తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్ కూడా బీజేపీలో  చేరనున్నారు.

అమరీందర్ సింగ్ గతేడాది  కాంగ్రెస్ ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు.