
భైంసా, వెలుగు: ప్రత్యేక తెలంగాణ సాధనలో ముథోల్నియోజకవర్గ ఉద్యమకారులది కీలక పాత్ర అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్వేణుగోపాలచారి అన్నారు. శుక్రవారం భైంసాలో ముథోల్ఉద్యమకారుల పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ రచయితలను ప్రోత్సహించి, పుస్తకానికి రూపకల్పన చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్మెనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నేరవేర్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఫోరం జిల్లా కార్యదర్శి చాకేటి లస్మన్న, పుస్తక సంపాదకుడు పుండలిక్ రావు పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి తదితరులున్నారు.