తెలంగాణ ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, దివంగత డాక్టర్ మల్లికార్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి మల్లికార్జున్, కుమారుడు మను మల్లికార్జున్.. సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు.
హైదరాబాద్లోని ప్రముఖ ప్రదేశంలో మల్లికార్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశాభివృద్ధికి, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషిని గుర్తించాలని అభ్యర్థించారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మల్లికార్జున్ పనిచేశారు. డిఫెన్స్, రైల్వే వంటి కీలకమైన పోర్ట్ ఫోలియోలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు సాగిన పోరాటంలో ఆయన కీలకపాత్ర పోషించారు. – వెలుగు, హైదరాబాద్