- ‘సాగర్’ మీదుగా రోప్వాక్
- లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్లో కొత్త అందాలు
- కొత్త ప్రాజెక్టు అమలుకు హెచ్ఎండీఏ రెడీ
హైదరాబాద్సిటీ, వెలుగు: హుస్సేన్సాగర్తీరాన్ని మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్లాన్లు వేస్తోంది. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్హబ్గా మార్చేందుకు హెచ్ఎండీఏలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు మాస్టర్ప్లాన్రూపొందిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఒక సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సదరు సంస్థ.. ట్యాంక్బండ్, ఎన్టీఆర్గార్డెన్, లుంబినీ పార్క్తో పాటు హుస్సేన్సాగర్తీరంలో ఏం చేస్తే మరింత మంది పర్యాటకులు వస్తారో చెప్తూ నివేదిక ఇస్తుంది. దీనికి ట్యాంక్బండ్ రీ వ్యాంప్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు.
అసలేంటి రీవ్యాంప్ ప్రాజెక్టు?
హుస్సేన్సాగర్తీరంలో సెక్రటేరియట్నుంచి మొదలుపెడితే లుంబినీపార్క్, ఎన్టీఆర్గార్డెన్స్, నెక్లెస్రోడ్, పీపుల్స్ప్లాజా, లేక్ఫ్రంట్పార్క్, జలవిహార్, వాటర్ఫాల్స్వంటి ఎన్నో విజిటింగ్ప్లేసెస్ఉన్నాయి. వీటిని రీ వ్యాంప్ప్రాజెక్టులో భాగంగా మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్లో ప్రస్తుతం ఉన్న వివిధ రకాల నిర్మాణాలు, ఆకర్షణలను పునరుద్ధరించబోతున్నారు.
హుస్సేన్సాగర్లో జీహెచ్ఎంసీ వైపు నుంచి సంజీవయ్యపార్క్వరకూ రోప్వాక్ప్రతిపాదన కూడా ఉందని అధికారులు తెలిపారు. అది సాధ్యం కాకపోతే లుంబినీ పార్క్నుంచి సంజీవయ్యపార్క్వరకు రోప్వాక్ నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం హుస్సేన్సాగర్తీరానికి రోజుకు 15వేల మంది వరకు టూరిస్టులు వస్తుండగా..పండగలు,సెలవు దినాలు, వీకెండ్లో ఈ సంఖ్య 50వేలకు చేరుకుంటోంది. ఈ సంఖ్య మరింత పెరగాలంటే ట్యాంక్బండ్పై మరిన్ని ఆకర్షణలు తప్పని సరి అని అధికారులు భావిస్తున్నారు.
