
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన ఫార్చ్యూన్ అకాడమీ మనీ మేనేజ్మెంట్పై మూడు రోజులపాటు మీటింగ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 5–7 తేదీల్లో గోవాలోని పార్క్ రెజిన్లో జరుగుతుంది. డబ్బును మరింత సమర్థంగా వాడటం, పొదుపు చేయడానికి సంబంధించిన పద్ధతులు నేర్పిస్తారు. డబ్బు ఆదాకు పాటించాల్సిన ఆక్వా సిలికా ఒడిస్సీ, టెర్రా ట్రాన్స్ఫర్మేషన్, ఈథర్ యాక్సెషన్ ఫీనిక్స్ ఇగ్నిషన్ వంటి వాటిపై అవగాహన కలిగిస్తారు. 'మనీ బ్రేక్త్రూ స్పెషలిస్ట్', డెంటిస్ట్ మణి పవిత్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని పద్ధతులను పాటించడం వల్ల తన ఆదాయం మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. డబ్బు సంపాదన కోసం రోజువారీగా పాటించాల్సిన జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో అవగాహన కలిగిస్తామని అన్నారు.