ఈ వారం 4 ఐపీఓలు.. బిజీ బిజీగా ఐపీఓ మార్కెట్

ఈ వారం 4 ఐపీఓలు.. బిజీ బిజీగా ఐపీఓ మార్కెట్

న్యూఢిల్లీ: ఈ వారం ఐపీఓ మార్కెట్ బిజీ బిజీగా ఉండనుంది. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్‌‌ రిసార్ట్స్ నడిపే ష్లాస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోపాక్ టెర్మినల్స్, ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ - ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఈ కంపెనీలు మొత్తం రూ.6,600 కోట్లకు పైగా సమీకరించనున్నాయి. అదనంగా, బోరానా వీవ్స్, బెల్‌‌రైజ్ ఇండస్ట్రీస్ మార్కెట్‌‌లో లిస్టింగ్ కానున్నాయి.

ష్లాస్ బెంగళూరు (లీలా హోటల్స్): ఈ కంపెనీ ఐపీఓ ద్వారా  రూ.3,500 కోట్లు సేకరించనుంది. ఇందులో  రూ.2,500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.వెయ్యి కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) ఉన్నాయి. షేర్ ధర రూ.413–435. కంపెనీ ఐపీఓ  మే 26- న ఓపెనై, 28 న ముగుస్తుంది. 

ఏజిస్ వోపాక్ టెర్మినల్స్: ఈ కంపెనీ ఐపీఓ  మే 26న ఓపెనై, -28న ముగియనుంది. ఒక్కో షేరుని రూ.223--–235 ప్రైస్ రేంజ్‌‌లో అమ్ముతున్నారు. ఐపీఓలో  రూ.2,800 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది.

స్కోడా ట్యూబ్స్: ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో  రూ.220 కోట్ల ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంది. ఓఎఫ్‌‌ఎస్‌‌  లేదు.  స్టెయిన్‌‌లెస్ స్టీల్ ట్యూబ్స్, పైప్స్ తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ మే28న ఓపెనై, 30న ముగుస్తుంది. షేర్ ధర రూ.130-–140. యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ మే 27న ఉంటుంది.

ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్: ప్రోస్టార్‌‌‌‌ ఇన్ఫో సిస్టమ్స్‌‌ ఐపీఓలో ఒక్కో షేరుని రూ.95–-105 ప్రైస్ రేంజ్‌‌లో అమ్మనుంది.  ఈ నెల 27న ఐపీఓ ఓపెన్ అవుతుంది. -29న ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూలో  రూ.168 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది.