
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నకోడూర్ మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్లో శనివారం (మే 3) నలుగురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో గల్లంతైన వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. ఒక యువతి మృతి చెందింది. యువతి డెడ్ బాడీ లభ్యం అయ్యింది.
ALSO READ | హైదరాబాద్లో విషాదం.. హార్పిక్ తాగిన భార్యాభర్త.. కడుపులో పేగులు కాలిపోయి భార్య మృతి
మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలిని మిరాజ్గా గుర్తించారు పోలీసులు. వరంగల్కు రెండు కుటుంబాలు హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో సరదాగా ఈత కొడుదామని ఆగారు. ఈ క్రమంలోనే ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ నలుగురు గల్లంతయ్యారు. ఘటన స్థలంలో పోలీసులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.