ఫ్రాన్స్ : కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడగించింది. మే 11 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశల వారీగా స్కూల్స్, బిజినెస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. జనం గుమిగూడకుండా జులై 15 వరకు కూడా చర్యలు చేపడతామంది. అప్పటి వరకు పబ్లిక్ ఈవెంట్స్ కు పర్మిషన్ ఇచ్చేది లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నివారణకు లాక్ డౌన్ కొనసాగించటం తప్ప వేరే మార్గం లేదన్నారు. ” మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. కరోనా అప్పటి వరకు తగ్గుతుందని భావిస్తున్నాం ” అని ఆయన చెప్పారు. కరోనా కేసులను బట్టి లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేస్తామన్నారు. కరోనా ఎఫెక్ట్ అధికంగా టాప్ ఫైవ్ కంట్రీస్ లో ఫ్రాన్స్ కూడా ఉంది. దాదాపు లక్షా 30 వేల మంది కరోనా బారిన పడగా 15 వేల మంది వరకు చనిపోయారు. సోమవారం ఒక్కరోజే ఫ్రాన్స్ లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నివారణకు మరింత గట్టి చర్యలు తీసుకోవటంలో భాగంగా లాక్ డౌన్ ను కంటిన్యూ చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయటం సరికాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలకు సూచించింది. అదే జరిగితే మళ్లీ సమస్య మొదటికొస్తుందని ప్రకటించింది.
మే 11 వరకు లాక్ డౌన్ …జులై 15 దాకా నో పబ్లిక్ ఈవెంట్స్
- విదేశం
- April 14, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు