హైదరాబాద్, వెలుగు : రాజ్భవన్రోడ్ లోని యశోద హాస్పిటల్సమీపంలోని శ్రీశ్రీ రవిశంకర్విద్యామందిర్స్కూల్లో రేపు ఉచిత హెల్త్క్యాంప్ నిర్వహిస్తున్నట్టు హెడ్మిస్ట్రెస్షీలారెడ్డి, ఫెసిలిటేటర్ అండ్ఈవెంట్మేనేజర్రాధారాం తెలిపారు. బీపీ చెకప్, బ్లడ్షుగర్, బ్లడ్ఆక్సిజన్లెవెల్స్టెస్టులతో పాటు వెయిట్, బీఎంఐ(బాడీ మాస్ఇండెక్స్) చెకప్ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి రిటైర్డ్ఐఏఎస్ఆఫీసర్, ఏపీ ఫార్మర్చీఫ్సెక్రటరీ, హోలిస్టిక్వెల్నెస్క్లినిక్ ఫౌండర్ఎస్పీ టక్కర్హాజరవుతారని చెప్పారు.
బ్యాచులర్ఆఫ్నాచురోపతి యోగా సైన్స్కు చెందిన డాక్టర్లు అమృత వర్షిణి(డిసీజ్రివర్సల్, బయోలాజికల్ఏజ్), డాక్టర్కార్తీక్రెడ్డి (ఆటో ఇమ్యూన్రివర్సల్ఎక్స్పర్ట్) , డాక్టర్ దేవదర్శిణి (సెల్విటాలిటీ, హెల్త్ఏజింగ్) వైద్య సేవలందిస్తారన్నారు. ఆదివారం ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. 7995008312 లేదా 9347211550 లో సంప్రదించవచ్చని సూచించారు.