
కోల్బెల్ట్, వెలుగు: పత్రికా రంగానికి, సింగరేణి కార్మికుల హక్కుల కోసం దివంగత జర్నలిస్ట్ మునీర్ చేసిన పోరాటాలు మరువలేనివని వక్తలు గుర్తుచేసుకున్నారు. మునీర్ స్మారకార్థం క్యాతనపల్లి మున్సిపల్ రెండో వార్డు మాజీ కౌన్సిలర్పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్లో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్ క్యాంప్ను ప్రారంభించారు.
పలువురు మాట్లాడుతూ.. భూస్వాములు, దొరల దౌర్జన్యాలకు, కాంట్రాక్టర్ల కార్మిక వ్యతిరేక విధానాలపై మునీర్ పోరాటాలు చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులను పాల్గొనేలా చైతన్యం తీసుకవచ్చారన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని రెనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాలలోని మెడి లైఫ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు 1050 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, పలు రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.