
హైదరాబాద్, వెలుగు : పర్యావరణానికి హాని లేకుండా వినాయక చవితిని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ సంస్థ ఎకో ఫ్రెండ్లీ సీడ్ గణేశ్బాక్సులను పంపిణీ చేయనుంది. 10 వేల సీడ్ గణేశ్ బాక్సులతో బయలుదేరిన వెహికల్స్ను శనివారం జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ డీజీఎం చేతన్ పింపాల్కుటే ప్రారంభించారు. వీటిలో 7 వేల సీడ్ గణేశ్ బాక్సులను సిటీలోని వివిధ అపార్ట్మెంట్లలో, మిగతా వాటిని బెంగళూరులో పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా డీజీఎం చేతన్ మాట్లాడుతూ.. సీడ్ గణేశ్ను కుండలో నిమజ్జనం చేస్తే విగ్రహంలో ఉన్న విత్తనం మొక్క రూపంలో పెరుగుతుందన్నారు. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకే, ఐదేండ్లుగా సీడ్ గణేశ్ బాక్సులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.