స్టార్టప్​ల​కు పైసల పంట

స్టార్టప్​ల​కు పైసల పంట

న్యూఢిల్లీ: స్టార్టప్‌‌‌‌లకు నిధులు వరదలా పారుతున్నాయి. వెంచర్​ ఇంటెలిజెన్స్​ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్​లో వీటికి 10 బిలియన్​ డాలర్ల ఫండింగ్ (దాదాపు రూ.76 వేల కోట్లు)​ రాగా, 329 డీల్స్​ జరిగాయి. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 5.7 బిలియన్​ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు రాగా,  225 డీల్స్​ కుదిరాయి. 2020 క్యూ1లో స్టార్టప్​లు 214 బిలియన్​ డాలర్లు అందుకోగా, 214 డీల్స్​ జరిగాయి. తాజా క్వార్టర్​లో లేట్​ స్టేజ్​ డీల్స్​ ద్వారా 5.8 బిలియన్​ డాలర్లను సమీకరించాయి. జనవరి–మార్చిలో వచ్చిన మొత్తం డీల్స్‌‌లో ఈ లేట్‌‌ స్టేజ్ డీల్స్ వాటా 45 శాతం. స్విగ్గీ అత్యధికంగా ఈ ఏడాది జనవరిలో 700 మిలియన్​ డాలర్లు సేకరించింది. సుమేరూ వెంచర్స్, ఇన్వెస్కో, ప్రోసస్​ వెంచర్స్​, ఖతర్​ ఇన్వెస్ట్​మెంట్​ అథారిటీ, అల్ఫా వేవ్​ గ్లోబల్​, ఐఐఎఫ్​ఎల్​వీసీ, కోటక్​ ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్స్​ఈ డబ్బును అందించాయి. మరో స్టార్టప్​ పాలిగాన్​కు ఫిబ్రవరిలో రిపబ్లిక్​ క్యాపిటల్​, గెలాక్సీ ఇంటరాక్టివ్​, సాఫ్ట్​బ్యాంక్, టైగర్​ గ్లోబల్​, సెకోవియా క్యాపిటల్​ ఇండియా నుంచి 450 మిలియన్​ డాలర్లు స్టార్టప్‌‌లకు అందాయి. సుమేరూ వెంచర్స్​, విట్రువియన్​ పార్ట్​నర్స్​తోపాటు మరికొన్ని సంస్థల నుంచి ఈ ఏడాది మార్చిలో బైజూస్​కు 400 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ వచ్చింది. యూనిఫోర్​ సాఫ్ట్​వేర్​ సిస్టమ్స్​ కూడా 400 మిలియన్​ డాలర్లను అందుకుంది. మార్చ్​ క్యాపిటల్​, ఎన్​ఏఈ వంటి సంస్థలు ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్​ చేశాయి. స్టార్టప్ కంపెనీ ఫ్రాక్టల్ టీపీజీ క్యాపిటల్​ నుంచి 360 మిలియన్​ డాలర్లు అందుకుంది.