ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్ జిల్లాలో  సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఈ నెల 4న సీఎం రేవంత్​రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం కలెక్టర్​రాజర్షి షా, ఎస్పీ అఖిల్​మహాజన్​పరిశీలించారు. ఎరోడ్రామ్​గ్రౌండ్​లో హెలీప్యాడ్​స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్​కలెక్టర్లు​శ్యామలాదేవి, రాజేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.