హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు

హైదరాబాద్ హయత్ నగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. గత కొన్నిరోజులు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా శుభోదయనగర్ కాలనీలో ఓ ఇంట్లో  చోరీకి పాల్పడ్డారు. 15 తులాల వెండి, 8 తులాల బంగారం, లక్షా 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.