
"డబ్ల్యూడబ్ల్యూఈ" ఈ పేరు ఒకప్పుడు ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటకు హైదరాబాద్ నగరం వేదికైంది. మరికొద్ది సేపట్లో తొలి ఫైట్ ప్రారంభం కానుండగా.. మొదటి మ్యాచులోనే స్టార్ రెస్లర్ జాన్ సినా ప్రత్యర్థితో తలపడనున్నారు. జాన్ సినాకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కండల వీరుడు ప్రత్యేకంగా రెస్లింగ్ కార్యక్రమం కోసం ఇండియాకు రావటం ఇదే మొదటి సారి.
ఈ శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మొత్తం 28 మంది రెస్లర్లు రింగులో తలపడనున్నారు. జాన్ సినా, వీర్, సంగ, డ్రూ మెక్ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ గుంథర్, జిందర్ మహాల్ మీజైన్, కెవిన్ ఓవెన్స్ తో పాటు పలువురు ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. దాదాపు 6 ఏళ్లుగా ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వహించటం లేదు. అలాంటిది ఆరేళ్ల తర్వాత హైదరాబాద్లో ఏ సంగ్రామం జరగబోతుండడం విశేషం.