సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ

 సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ

దళితుల మధ్య చిచ్చులు పెట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి ఇపుడు బయటపడుతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను  ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.పదేళ్లలో కేసీఆర్ యువతను పట్టించుకోలేదన్నారు.  

తాను సొంతంగా కంపెనీ పెట్టి 500 మందికి ఉపాధి ఇస్తున్నానని చెప్పారు వంశీకృష్ణ.   అందరి సహకారంతో పెద్దపల్లిని  మరింత అభివృద్ధి చేస్తానన్నారు.  బడుగు బలహీన వర్గాల కోసం  తన వంతు కృషి చేస్తానన్నారు.  మాదిగ భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని చెప్పారు.  

పెద్దపల్లితో కాకాది దశాబ్దాల అనుబంధం అన్నారు గడ్డం వంశీకృష్ణ. సింగరేణికి రూ. 450 కోట్లు కేటాయించి సంస్థను ఆదుకున్నారని చెప్పారు.కార్మికులంటే కాకాకు ఎంతో ఇష్టమన్నారు. కార్మికుల కష్ట సుఖాల్లో కాకా పాలుపంచుకున్నారని చెప్పారు.   అంబేద్కర్ విద్యా సంస్థలతో పేద వారికి విద్యనందిస్తున్నామని.. విశాఖ ట్రస్ట్ పేరుతో పేద విద్యార్థులను ఆదుకున్నామని చెప్పారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కుల మత భేదాలు చూడకండా అందరి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.