హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ను సీఎం కేసీఆర్ గతంలో ఘోరంగా అవమానించారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఐదు నెలల క్రితం ప్రగతిభవన్ ముందు గద్దర్వేచి చూస్తున్న ఫొటోను మంగళవారం ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘‘కేసీఆర్ను కలిసేందుకు గద్దరన్న రెండు సార్లు ప్రయత్నించారు. 2023 ఫిబ్రవరి 28న సీఎంను కలిసేందుకు గద్దరన్న ప్రగతి భవన్కు వెళ్లారు. కేసీఆర్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆఫీసర్లను కోరారు. వారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో దాదాపు 3 గంటల ఎండలోనే కూర్చున్నారు.
బతికి ఉన్నప్పుడు గద్దరన్నను కలిసేందుకు కేసీఆర్ఇష్టపడలేదు. పైగా అవమానించిండు. చనిపోయాక అధికార లాంఛనాలతో అంత్యక్రియలంటూ గద్దరన్న ఇంటికిపోయి ఓట్ల వేట మొదలు పెట్టిండు’’ అని కేసీఆర్పై ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు.