గద్దర్​ను ఎండల కూసొవెట్టి అవమానించిండు: ఆకునూరి మురళి ఫైర్

గద్దర్​ను ఎండల కూసొవెట్టి అవమానించిండు: ఆకునూరి మురళి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్​ను సీఎం కేసీఆర్​ గతంలో ఘోరంగా అవమానించారని రిటైర్డ్ ఐఏఎస్​ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఐదు నెలల క్రితం ప్రగతిభవన్​ ముందు గద్దర్​వేచి చూస్తున్న ఫొటోను మంగళవారం ఆయన తన ట్విట్టర్ అకౌంట్​లో  షేర్​ చేశారు. ‘‘కేసీఆర్​ను కలిసేందుకు గద్దరన్న రెండు సార్లు ప్రయత్నించారు. 2023 ఫిబ్రవరి 28న సీఎంను  కలిసేందుకు గద్దరన్న ప్రగతి భవన్​కు వెళ్లారు. కేసీఆర్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆఫీసర్లను  కోరారు. వారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో దాదాపు 3 గంటల ఎండలోనే కూర్చున్నారు. 
బతికి ఉన్నప్పుడు గద్దరన్నను కలిసేందుకు కేసీఆర్​ఇష్టపడలేదు. పైగా అవమానించిండు. చనిపోయాక అధికార లాంఛనాలతో అంత్యక్రియలంటూ గద్దరన్న ఇంటికిపోయి ఓట్ల వేట మొదలు పెట్టిండు’’ అని కేసీఆర్​పై ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు.