న్యూఢిల్లీ : స్క్రాపింగ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడంలో ఆటోమొబైల్ డీలర్లు కూడా చొరవ తీసుకోవాలని రోడ్ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ పిలుపు ఇచ్చారు. వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెబుతూ, సర్క్యులర్ఎకానమీని ఎంకరేజ్ చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటో రిటైల్ కాంక్లేవ్లో గురువారం నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఇండియాను అతి పెద్ద గ్రీన్హైడ్రోజన్ మాన్యుఫాక్చరర్గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.
బయోఫ్యూయెల్ వంటి ఆల్టర్నేటివ్ ఫ్యూయెల్స్ను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నామని అన్నారు. దేశం అయిదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడంలో ఆటోమొబైల్ డీలర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఇండియా ప్యాసింజర్ వెహికల్స్ తయారీలో గ్లోబల్గా నాలుగో ప్లేస్లోనూ, కమర్షియల్ వెహికల్స్ తయారీలో ఆరో ప్లేస్లోనూ నిలుస్తోంని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మారాలనేదే తన కలగా పేర్కొన్నారు. నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ఆగస్టు 2021 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛ్ చేశారని చెబుతూ, అన్ఫిట్, పొల్యూటింగ్ వెహికల్స్ తగ్గించడానికి ఈ పాలసీ వీలు కల్పిస్తుందని మంత్రి వెల్లడించారు.