దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ ‘గెలాక్సీ ఎం14’ పేరుతో ఇండియా మార్కెట్లో 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో 6.6 ఇంచుల స్క్రీన్, ఈక్సినాస్1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్ ఛార్జింగ్ ఉంటాయి. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 13,490 కాగా, 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 14,990. ఈ స్మార్ట్ఫోన్ బ్లూ, డార్క్ బ్లూ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ నెల 21 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.
