గేమ్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌లో సాగే థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌

గేమ్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌లో సాగే థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌

గీతానంద్, నేహా సోలంకి జంటగా ద‌‌‌‌యానంద్ దర్శకత్వంలో  ర‌‌‌‌వి క‌‌‌‌స్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్‌‌‌‌’. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైమ్‌‌‌‌లో సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్‌‌‌‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని ముగించాలనుకునే ఓ వ్యక్తి, దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్‌‌‌‌లో చూపించాం. 

హీరో గీతానంద్ తన పెర్ఫార్మెన్స్‌‌‌‌తో ఆకట్టుకుంటాడు.  సీనియర్ యాక్టర్స్ శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్, మధుబాల గారు ఇందులో పార్ట్ అవడం సినిమాకు ప్లస్ అయ్యింది.  డైరెక్టర్ దయానంద్‌‌‌‌ తన క్రియేటివ్ మైండ్‌‌‌‌తో అద్భుతంగా రూపొందించాడు.  అభిషేక్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌‌‌‌గా ఉంటుంది. టీమ్ అంతా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం. ప్రస్తుతం రెండు కథలు విన్నా. త్వరలో వాటిని అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.