
- వైరస్ లక్షణాలుంటే ముందుగా ఐసోలేట్ కావాలి
- జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు 59 శాంపిల్స్
- గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు
పద్మారావునగర్, వెలుగు : కరోనా జేఎన్.1 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వైరస్ విస్తరిస్తుండగా.. లక్షణాలున్నవారు వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ పొందాలని కొవిడ్ నోడల్ కేంద్రం, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ఫస్ట్, సెకండ్ సీజన్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, వైరస్నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ప్రస్తుతం కొంత శ్రద్ధ తగ్గి, సొంత వైద్యానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇటీవల ఒక పేషెంట్ పాజిటివ్అనుమానంతో గాంధీలో అడ్మిట్కాగా పరీక్షలు చేస్తే నెగిటివ్వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జీనోమ్ సీక్వెన్సింగ్కు 59 శాంపిల్స్ను సీడీఎఫ్డీ ( సెంటర్ఫర్డీఎన్ఏ ఫింగర్ప్రింట్అండ్డయాగ్నోస్టిక్స్)కు పంపినట్లు తెలిపారు. భవిష్యత్లో వైరస్ బాగా ప్రబలితే, పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్అనుమతి ఇస్తే గాంధీలోని వైరాలజీ ల్యాబ్లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. కోమార్డిస్ పేషెంట్లు కిడ్నీ, లివర్, గుండె, టీబీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నవారు వెంటనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మన దగ్గర జేఎన్.1 ప్రభావం ఇంతవరకు ఏమీ లేదని, పాజిటివ్ రేట్ కూడా బాగా తక్కువని తెలిపారు. ప్రస్తుతం గాంధీలో పాజిటివ్ కేసులు లేవన్నారు. అయితే లేబర్వార్డు, క్యాజువాలిటీ వెనక వైపు రెండు కొవిడ్ ఐసోలేషన్ వార్డులను అన్ని వైద్య వసతులతో సిద్ధంగా ఉంచామన్నారు.
నిలోఫర్లో మరో చిన్నారికి కరోనా
మెహిదీపట్నం : నిలోఫర్ ఆస్పత్రిలో మరో చిన్నారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మంగళవారం ఆస్పత్రిలో మొత్తం 17 మంది చిన్నారుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపినట్లు డాక్టర్లు తెలిపారు. బుధవారం రిజల్ట్స్ రాగా.. చౌటుప్పల్కు చెందిన 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. నిలోఫర్లో మూడ్రోజుల్లో మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదైన కేసుతో కలిసి నిలోఫర్లో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పేర్కొన్నారు.