అమెరికాలో జరిగిన గ్యాంగ్ వార్ లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిస్ణోయ్ముఖ్య అనుచరుడు చనిపోయాడు. ఆదివారం( జవనరి 11) ఇండియానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు, ప్రత్యర్థి రోహిత్ గోదారా గ్యాంగ్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బిష్ణోయ్ అనుచరుడు, హర్యానాకు చెందినవీరేంద్ర సాంభి మృతిచెందారు. కాల్పుల్లో వీరేంద్ర సాంభి శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతిచెందాడు. వీరేంద్ర సాంభూను తామే చంపినట్లు రోహిత్ గోదారా అనుచరులు బల్జోత్సింగ్, జల్సాలు ప్రకటించారు. అయితే సాంభూ హత్యపై ఇప్పటివరకు అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. రోహిత్ గోదారా గ్యాంగ్ కు చెందిన ఓ గ్యాంగ్స్టర్ను సోమవారం ( జనవరి 12) ఢిల్లీలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న హర్యానాకు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికాస్ అనేక క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్లో నమోదైన ఆయుధాల అక్రమ రవాణా చట్టం కింద వికాస్ను అరెస్టు చేశారు.
రోహిత్ గోదారా గ్యాంగ్..
రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన రోహిత్ గోదారా ఈ గ్యాంగ్ కు లీడర్.. గతంలో బిష్ణోయ్ కి సన్నిహితుడు.బిష్ణోయ్ , గోల్డీ బ్రార్ క్రిమినల్ నెట్ వర్క్ లో ఓ భాగం. తర్వాత స్వతంత్రంగా గ్యాంగ్ ను నడుపుతున్నాడు. కెనడా, అజర్ బైజన్ వంటి పలు దేశాలనుంచి గ్యాంగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.దోపిడీలు, హత్యలు, ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొంటున్నారు రిపోర్టులు చెబుతున్నాయి. గతేడాది నవంబర్ లో రోహిత్ గోదారా గ్యాంగ్ కు చెందిన ఇద్దరు సభ్యులను హర్యానా పోలీసులు అరెస్ట్చేశారు.
►ALSO READ | నేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన ప్రకటన..
