నిజామాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్ : సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్ లో  గంజాయి ముఠా అరెస్ట్ :  సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్​, వెలుగు:  గంజాయి సేవిస్తూ ఇతరులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. అమ్మకాల్లో ముఠాకు ఏజెంట్లుగా పనిచేసిన వారిని కూడా గుర్తించామన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్ రూమ్​లో మీడియాతో మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్​లో గంజాయి ముఠా ఉందనే సమాచారంతో దాడి నిర్వహించి ఆర్మూర్​కు చెందిన మహ్మద్ అంజద్​ నుంచి 1.2 కిలోల గంజాయితో పట్టుకున్నామన్నారు.

 కొనుగోలు చేయడానికి వచ్చిన మహ్మద్ నయీం, చిల్వేరు మనోజ్​కుమార్,  మైనర్ బాలుడు దొరికారన్నారు. వారిని విచారించి బాల్కొండకు చెందిన జక్కుల గోవింద్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నారని,  కమీషన్​ ఏజెంట్లను నియమించుకున్నారన్నారు.

మొబైల్​ ఫోన్​లో ఆర్డర్లు బుక్​ చేసుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. మైనర్​ సహా తమకు పట్టుబడిన ఆరుగురు నిందితులను రిమాండ్​కు తరలించి పరారీలో ఉన్న మున్నీ, వహీద్​ సుల్తాన్, సోఫియాన్ కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ జాన్​రెడ్డి, ఎస్సై శైలేందర్ తదితరులు ఉన్నారు.