యూత్​కు నచ్చేలా.. చిత్రం గంజామ్

యూత్​కు నచ్చేలా.. చిత్రం గంజామ్

త్రిగుణ్ హీరోగా సురేష్ కుమార్ ఆకిరి దర్శకత్వంలో హేమ బాల వెంకట రత్నాజీ  నిర్మిస్తున్న చిత్రం ‘గంజామ్’. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. అనిత చౌదరి, ధనరాజ్, వేణు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రఘు కుంచె కీలక పాత్రతో పాటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగింది. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ ‘నేను నటిస్తున్న 23వ సినిమా ఇది.  

కథా బలం ఉన్న సినిమాలను ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. దీన్ని కూడా తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం’ అన్నాడు. యూత్‌కు నచ్చే అంశాలతో పాటు ఇందులో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. అందర్ని ఆలోచింపజేసేలా సినిమా ఉంటుందని రఘు కుంచె అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.