హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి

హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి

డోర్నకల్ (గార్ల), వెలుగు: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం, మద్ధివంచ గ్రామపంచాయతీలకు వెళ్లేందుకు పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గార్ల మండల కాంగ్రెస్ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి భారీగా తరలివెళ్లి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మండలంలోని సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి హై లెవెల్ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.