గాజాలోని అల్ అహిల్ అరబ్ ఆస్పత్రిపై దాడి తనకు ఆగ్రహాన్ని తెప్పించిందని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ తెలిపారు.ఘటనపై జోర్డాన్ రాజు అబ్దులా 2, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటన చాలా బాధాకరమని.. వివరాలన్ని సేకరించమని తమ బృందానికి చెప్పానన్నారు. పౌరుల ప్రాణాల రక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ఘోరంపై తమ సంతాపం తెలియజేస్తున్నామన్నారు.
I am outraged and deeply saddened by the explosion at the Al Ahli Arab hospital in Gaza, and the terrible loss of life that resulted. Immediately upon hearing this news, I spoke with King Abdullah II of Jordan, and Prime Minister Netanyahu of Israel and have directed my national…
— President Biden (@POTUS) October 17, 2023
గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇజ్రాయేలే ఈ దాడికి పాల్పడిందని ఆరోపించింది. ఇదొక యుద్దంగా పేర్కొంది. ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసం అయి చెల్లాచెదురుగా పడిన మృతదేహాలున్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇజ్రాయెల్లో బైడెన్ టూర్
మరో వైపు బైడెన్ అక్టోబర్ 18న ఇజ్రాయెల్, జోర్డాన్లో పర్యటిస్తారు. హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్కు మద్దతు తెలపడంతోపాటు గాజాలోని పాలస్తీనా పౌరులకు మానవతా సాయం అందించడంపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ‘హమాస్ కిరాతక టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు నేను బుధవారం ఆ దేశానికి వెళ్తున్నా’ అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.