న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో ఇబ్బందులు, దేశంలో డిమాండ్తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ గ్రోత్ను 6.6శాతం (డిసెంబర్ అంచనా ) నుంచి 6.3శాతానికి వరల్డ్ బ్యాంక్ తగ్గించింది. అప్పుల భారం ఎక్కువ కావడం, రాబడులు తగ్గడం వల్ల ప్రైవేట్ కన్సంప్షన్ పెరుగుదలకు ఆటంకాలు ఎదురవుతాయని తెలిపింది.
కరోనా సమయంలో ప్రారంభించిన పథకాలను నిలిపివేస్తున్నందున ప్రభుత్వ ఖర్చులూ తగ్గుతాయని అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడీపీ గ్రోత్ 6.4 శాతం వరకు ఉండొచ్చని ఆర్బీఐ ప్రకటించింది. కేంద్రం అంచనాల ప్రకారం.. ఇండియా 2023లో ఏడుశాతం గ్రోత్ సాధిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ కన్సంప్షన్ గ్రోత్ 8.3 శాతం ఉండగా, 2024 లో ఇది 6.9శాతానికి తగ్గవచ్చు.