బషీర్బాగ్, వెలుగు: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రావాల్సిన రూ.13 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న బషీర్బాగ్లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కర పత్రాన్ని హిమాయత్ నగర్ బహదూర్ గౌర్ హాల్ లో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోథుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ కాంస్య విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బి.నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి మారగోని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
