డబ్బులంటే ఎలాగో సేవ్ చేయలేకున్నాం.. కనీసం టైమ్ అయినా సేవ్ చేద్దాం బ్రో.. టైమ్ బ్యాంక్ గురించి తెలుసా ?

డబ్బులంటే ఎలాగో సేవ్ చేయలేకున్నాం.. కనీసం టైమ్ అయినా సేవ్ చేద్దాం బ్రో.. టైమ్ బ్యాంక్ గురించి తెలుసా ?
  • ‘టైం సరిపోదులే.. నాకు కుదరదు.’
  • ‘నాకు అంత టైం లేదండి..’ 
  • ‘కొంచెం టైం ఉంటే బాగుండు..’

ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పరిస్థితుల్లో అనుకునే ఉంటాం. అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే ఏ పని చేయడానికైనా ప్రతి మనిషికీ కావాల్సినంత టైం ఉంటుంది. కానీ సమయాన్ని సరిగ్గా వాడుకోకపోవడం వల్లే అవసరమైనప్పుడు టైం సరిపోక ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే స్కూల్​కు వెళ్లే వయసు నుంచి ఉద్యోగాలు చేసే వరకు టైం మేనేజ్​మెంట్​ గురించి చెప్తూనే ఉంటారు. అవన్నీ విన్నా వాటిని పాటించలేకపోతున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అంటే అందుకు కారణం.. టైం మేనేజ్​మెంట్​ మనకు సరిగా రాకపోవడమే. కానీ ప్రపంచంలో అందరూ అలా లేరు.. జపనీయులు టైంని చాలా బాగా మేనేజ్​ చేస్తారు. ఎందుకంటే.. వాళ్ల దగ్గర టైం బ్యాంక్ ఉంది. 

సాధారణంగా డబ్బులు దాచుకోవడానికి అయితే బ్యాంక్​లు ఉంటాయి. కానీ, జపాన్​లో టైం సేవ్ చేసుకోవడానికి కూడా బ్యాంక్​లు ఉన్నాయి. జపాన్​లోని ఒసాకాలో ఉండే టెరుకొ మిజుషిమా అనే వ్యక్తి 1973లో ఫుర్యా కిప్పు పేరుతో టైం బ్యాంక్​ కాన్సెప్ట్​ను ప్రపంచానికి మొదటిసారి పరిచయం చేశాడు.  ఫుర్యా కిప్పు అంటే కేరింగ్ రిలేషన్​షిప్​కు టికెట్​ తీసుకోవడం అని అర్థం. ముసలి వాళ్లు, సహాయం కోరే వాళ్లకు కొన్ని గంటలపాటు ఎవరైనా సర్వీస్​ చేస్తే.. ఆ టైం వాళ్లు చేసే ఉద్యోగాల్లో మెరిట్ స్కోర్​లా యాడ్ అవుతుంది. దీన్నే టైం కరెన్సీ అంటారు. ఈ కరెన్సీ విలువ అన్ని రకాల పనులకు సమానంగా ఉంటుంది. 

దీనివల్ల కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సమాజానికి మేలు చేసే పనుల్లో భాగం కావొచ్చు. స్వచ్ఛందంగా సొసైటీకి సేవ చేసేవాళ్లకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అయితే అసలు ఈ కాన్సెప్ట్​ ఎందుకు మొదలుపెట్టారంటే.. ఒసాకా ప్రాంతంలో ప్రజల్లో వృద్ధులు ఎక్కువైపోవడంతో వాళ్లకు సాయం చేయడానికి ఎవరూ లేక ఇబ్బందులు పడేవారు. అందుకే యువత ఈ ప్రాబ్లమ్​కు సొల్యూషన్​ చూపిస్తుందని నమ్మిన టెరుకో ఈ ఆలోచన చేశాడు. ఇప్పుడు ఒసాకాలోనే కాదు.. జపాన్​ అంతటా టైం బ్యాంక్​లు వెలిశాయి. 

టైం బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

‘టైం బ్యాంక్​ ఆఫ్​ ఇండియా’ పేరుతో ఇదే కాన్సెప్ట్​ని ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో 20 మంది కలిసి టైం బ్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టైం బ్యాంక్ ఆఫ్​ ఇండియాలో ఏడు వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. అందులో అడ్రెస్​ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. కేవైసీ పూర్తయ్యాక అకౌంట్​ ఓపెన్ అవుతుంది. తీరిక వేళల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఎంత టైం కేటాయిస్తే అంత పాస్​బుక్​లో జమ చేస్తారు. 

లేటెస్ట్​గా కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ఎలికుళం పంచాయతీ టైం బ్యాంక్​ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్​ను పంచాయతీలోని అన్ని వార్డుల్లో ఉన్న వృద్ధులను ఏకం చేసే ‘నిరవు @ 60 ప్లస్​’ అనే గ్రూప్​ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ గ్రూప్​ పంచాయతీలో ఉన్న 7,652 మంది సీనియర్ సిటిజన్​ల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే, ఈ బ్యాంక్​ ఉద్దేశం ఏంటంటే.. వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టడం. వాళ్లకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందించడం. 

రోజువారీ పనుల్లో సాయం చేయడం. ఒక వాలంటీర్​ వృద్ధుడికి గంట సమయం కేటాయిస్తే ఆ టైంని అతని పేరుతో టైం బ్యాంక్​ ఖాతాలో డిపాజిట్​ చేస్తారు. ఈ వాలంటీర్​కు ఫ్యూచర్​లో 60 ఏండ్లు దాటిన తర్వాత సాయం అవసరమైనప్పుడు వాళ్లు తమ అకౌంట్​లో ఉన్న క్రెడిట్​ను వాడి వాలంటీర్​ సేవలు పొందొచ్చు. ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహిస్తుంది. ఈ కాన్సెప్ట్​ కేవలం సేవ చేయడానికి మాత్రమే కాదు.. యువతలో సామాజిక బాధ్యను పెంచడానికి, అలాగే తరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సాయపడుతుందని అధికారులు తెలిపారు.