Geethanjali Malli Vachindhi: స్మశానంలో టీజర్ లాంచ్.. ఇదెక్కడి మాస్ ట్రెండ్రా మావా!

Geethanjali Malli Vachindhi: స్మశానంలో టీజర్ లాంచ్.. ఇదెక్కడి మాస్ ట్రెండ్రా మావా!

సౌత్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. అయితే దాదాపు 10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. 

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం మేకర్స్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందుకోసం సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం చేస్తున్నారు. అదేంటంటే.. హారర్ బ్యాక్డ్రాప్ వస్తున్న ఈ సినిమా టీజర్ ను అదే రేంజ్ లో ఉండేలా స్మశానంలో రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని పంజాగుట్ట స్మశానవాటికలో రాత్రి 7 గంటలకి గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంఛ్ చేస్తున్నాం. అంటూ ప్రకటన చేశారు. 

ALSO READ : Weekend OTT Movies: వీకెండ్ OTT మూవీ మస్తీ.. లిస్టులో క్రేజీ సినిమాలు

ఇది చూసిన ఆడియన్స్  స్మశానంలో టీజర్ లాంచా.. ఇదెక్కడి మాస్ ట్రెండ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత హారర్ సినిమా అయితే మాత్రం డైరెక్ట్ స్మశానంలో టీజర్ లాంచ్ చేస్తారా అని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వినూత్న నిర్ణయంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. మరి టీజర్ లాంచ్ నే సరికొత్తగా ప్లాన్ చేసిన మేకర్స్ సినిమాను ఏ రేంజ్ లి సెట్ చేసుంటారో చూడాలి.