పదేళ్ల క్రితం ‘గీతాంజలి’గా ఆకట్టుకున్న అంజలి.. తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అంటూ సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకుడు. మార్చి 22న సినిమా విడుదల కానుంది. శనివారం రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్కు హీరో శ్రీవిష్ణు, దర్శకులు బాబీ, గోపిచంద్ మలినేని, బుచ్చిబాబు అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
అంజలి మాట్లాడుతూ ‘ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్లో ప్రేక్షకులు మంచి ఎక్స్పీరియెన్స్ను పొందుతారు’ అని చెప్పింది. కోన వెంకట్ మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం వచ్చిన ‘గీతాంజలి’ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం అన్ని భాషల్లో హిట్ అయింది. అదే తరహాలో సీక్వెల్లోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. మంచి సినిమా చేశాననే సంతృప్తి కలిగిందన్నాడు దర్శకుడు శివ. నటులు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.